Ind Vs Eng 1st Test Day 5: భారత్ తో తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం వైపు సాగిపోతుంది. 371 పరుగుల లక్ష్యంతో రెండు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. డకెట్ 59 పరుగుల, క్రాలే 42 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లలోనే 108 పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం.విజయం కోసం మరో 263 రన్స్ చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఈ పార్ట్ నర్ షిఫ్ ను బ్రేక్ చేస్తేనే మ్యాచ్ లో గెలిచే చాన్స్ ఉంటుంది.