
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 78,992 పరీక్షలు నిర్వహించగా 2,058 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 23 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,31,618కి చేరింది. ప్రస్తుం రాష్ట్రంలో 21,180 యాక్టివ్ కేసులున్నాయి.