
నగర ప్రయాణికులకు మెట్రో అధికారులు శుభవార్త వినిపించారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపట్నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు ఒంటి గంటకు బయల్దేరి 2 గంటల వరకు చివరి స్టేషన్ కు చేరుకోనుంది. లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు.