
ఆనందయ్య ఔషధ పంపిణీపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. చుక్కల మందును 5 ల్యాబుల్లో పరీక్షించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. వీటిలో కంటికి హానిచేసే పదార్థముందని ల్యాబ్ లు నివేదించినట్లు తెలిపారు. దీంతో ల్యాబ్ ల నివేదికలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. చుక్కల మందును ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం జూలై 1కి వాయిదా వేసింది.