తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురింసింది. దీంతో దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కమలానగర్ తదితర ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. సరూర్ నగర్ చెరువులోకి భారీగా వరద చేరడంతో చైతన్యపురి పరిధిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఎల్బీనగర్, ఉప్పల్ నియోజవర్గాల పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.