
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో 47,972 మంది నమూనాలు పరీక్షించగా 1,002 కొత్త కేసులు నమోదయ్యాయి. 12 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఒక్కక్కరు చొప్పున మృతి చెందారని అధికారులు తెలిపారు.