
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,606 పరీక్షలు నిర్వహించగా 1,546 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,71,554 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 18 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,428కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,170 యాక్టివ్ కేసులున్నాయి.