
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 74,820 మంది నమూనాలు పరీక్షించగా 2,174 కొత్త కేసులు నమోదయ్యాయి. 18 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 2,737 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల కృష్ణాజిల్లాలో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు.