
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిని 24 గంటల్లో 90,574 మంది నమూనాలు పరీక్షించగా 3,841 కొత్త కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 3,963 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ లో తెలిపింది. కరోనా వల్ల కృష్ణాలో 8, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5 మంది మరణించారు.