కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోకి రాకపోవడంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి ఈనెల 23,24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ అమలు చేయాలని పినరాయి విజయన్ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు మూడు లక్షల టెస్టులతో భారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించింది.