Bangladesh Conspiracy : బంగ్లాదేశ్లో అంతర్జాతీయ గూఢచారుల కదలికలు, వరుస హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా, పాకిస్తాన్, టర్కీకి చెందిన పలువురు వ్యక్తులు బంగ్లాదేశ్లోని స్టార్ హోటల్స్లో బస చేసి, ఏదో పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటికి రావడంతో అజ్ఞాత సాయుధుల బృందం రంగంలోకి దిగి వారిని వరుసగా హత్య చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ పరిణామంతో మిగిలిన అమెరికన్, టర్కీష్ గూఢచారులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని, ముసుగులు ధరించి మరీ ఆ దేశం నుంచి పారిపోతున్నట్లు సమాచారం.
‘కాక్స్ బజార్’లో అమెరికన్ల మృతి
సెప్టెంబర్ 1 నుంచి 5వ తేదీ మధ్య కాలంలో బంగ్లాదేశ్లో అనేక మంది అమెరికన్లు మరణించారు. ముఖ్యంగా రోహింగ్యాలు నివసించే ప్రాంతమైన కాక్స్ బజార్లో ఏకంగా నలుగురు అమెరికన్లు చనిపోయారు. వీరంతా అమెరికా సైన్యంలో పనిచేసి రిటైర్ అయినవారు. వీరు కేవలం సాధారణ పర్యటనకు కాకుండా బంగ్లాదేశ్లో ఏదో రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
చిట్టగాంగ్ పోర్ట్ ప్రాంతంలో కూడా మరో నలుగురు అమెరికన్ గూఢచారులు ఇదే తరహా కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ అమెరికన్ల బృందం పాకిస్తాన్, టర్కీకి చెందిన గూఢచారులతో కలిసి ఒక పెద్ద ఆపరేషన్ లేదా కుట్రకు శిక్షణ ఇస్తున్నట్లుగా, లేదా భాగమవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు?
బంగ్లాదేశ్లో అంతర్జాతీయ గూఢచారులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చినట్లుగా చెప్పబడుతున్న ఈ అమెరికన్ గూఢచారులు ఇలా వరుసగా చనిపోతుండడం స్థానికంగా పెద్ద ఉత్కంఠకు దారితీసింది. ఈ రహస్య ఆపరేషన్ లేదా కుట్రను ఎవరు బయటపెట్టారు? అజ్ఞాత సాయుధులను నడిపిస్తున్నది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
ఈ హత్యల వెనుక బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని అంతర్గత వర్గాలు ఉన్నాయా, లేక ఈ కుట్రను భగ్నం చేయాలనుకుంటున్న మరేదైనా అంతర్జాతీయ శక్తి హస్తం ఉందా అనేది తేలాల్సి ఉంది.
అయితే భారత్ కు వ్యతిరేకంగా ఇటీవల పాకిస్తాన్ ఐఎస్ఐ, టర్కీ కలిసి కొన్ని కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. మోడీ ప్రభుత్వం టారిఫ్ లు వేసినా ట్రంప్ ను పట్టించుకోకుండా రష్యాతో చెలిమి చేస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లోని ఈ గూఢచారులను భారత్ ఏమైనా రహస్య ఆపరేషన్ చేసి తుదముట్టించిందా? అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మరో కోణం చూస్తే.. మయన్మార్ లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అక్కడి చైనా ప్రభుత్వం మయన్మార్ శివారులోని కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులతో కలిసి ఈ మినరల్స్ ను దోచుకుంటోంది. టై అప్ అయ్యి వాటిని సేకరిస్తోంది. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో అమెరికా, టర్కీ, పాక్ మాజీ సైనికులను రంగంలోకి దించి అక్కడి వారికి డ్రోన్స్, ఆయుధ శిక్షణలు ఇచ్చి చైనా వారిని సాగనంపేందుకు కుట్ర చేస్తున్నట్టు సమాచారం. ఇది తెలిసే చైనా ఏకంగా బంగ్లాదేశ్ లో రహస్య ఆపరేషన్ కు వచ్చిన అమెరికన్స్, టర్కీస్, పాక్ గూఢచారులను వరుసగా లేపేస్తున్నట్టు సమాచారం.
ఏదేమైనా, బంగ్లాదేశ్ ఇప్పుడు అంతర్జాతీయ గూఢచార సంస్థల మధ్య పోరాటానికి కేంద్రబిందువుగా మారిందనే చర్చ జోరుగా సాగుతోంది.