
బెజవాడలో నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. విజయవాడ దుర్గ అగ్రహారంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కండ్రిగకు చెందిన రామారావుగా గుర్తించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు.