
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై అధికారులు కొరడా ఝళిపించారు. ఆరోగ్య శ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై గుంటూరు జిల్లా అధికారులు భారీగా జరిమానా విధించారు. గుంటూరు జిల్లాలో 52 ఆస్పత్రులకు మొత్తంగా రూ. 1.25 కోట్ల జరిమానా విధించినట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ వెల్లడించారు. 25 ఆస్పత్రులకు రూ. 2 లక్షల చొప్పున, 12 ఆస్పత్రులకు రూ. 5 లక్షల చొప్పున, 15 ఆస్పత్రులకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించినట్లు ఆయన వివరించారు.