
దేశంలో రోజువారీ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరోసారి మరణాలు నాలుగువేలకుపైగా నమోదయ్యాయి. ఇటీవల కొత్త కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,57,299 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. కొత్తగా 4,194 మంది మహమ్మారి బారినపడి మరణించారు. తాజాగా 3,57,630 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,62,89,290కు పెరిగాయి. ఇప్పటి వరకు 2,30,70,365 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,95,525 మంది ప్రాణాలు కోల్పోయారు.