
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోనీ ఆడకపోతే తానూ ఐపీఎల్ కు దూరమవుతానని స్పష్టం చేశాడు. ఈ సీజన్ లో చెన్నై గెలిస్తే మరో రెండేళ్లు కొనసాగేందుకు మహీ భాయ్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. నేను మరో నాలుగైదేళ్లు ఆడగలను. ఈ ఐపీఎల్ సీజన్ ఇంకా ఉంది. వచ్చే ఏడాది మరో రెండు జట్లు రాబోతున్నాయి. ఈ ఏడాది మేం రాణిస్తామని ధీమాగా ఉన్నాను. అని రైనా అన్నాడు.