చైనా నుంచి కరోనా విస్తరించిన నేపథ్యంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోయినా వైట్ హౌజ్లో అవకాశం దొరికిన వాటిపై చర్యలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే చైనాకు చెందిన కొన్ని కంపెనీలపై నిషేధం ప్రకటించిన ట్రంప్ తాజాగా మరో 31 కంపెనీలపై ఆంక్షలు విధించారు. వీటిలో చైనా టెలికం కార్పొరేషన్ లిమిటెడ్, చైనా మొబైల్ లిమిటెడ్, హిక్ విజన్ వంటి టెలికం సంస్థలు ఉన్నాయి. చైనా తన సైనిక, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి అమెరికా పెట్టుబడులను దుర్వినియోగం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. కాగా చైనా కంపెనీలపై విధించిన నిషేధం జనవరి 11 2911 నుంచి అమల్లోకి రాబుతుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Shock to china ban on 31 companies in america
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com