ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, అంసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే వీసీల నియామకాలు ప్రక్రియపై కూడా మాట్లాడినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థతిలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా అంతకుముందు గవర్నర్ కు సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.