spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Congress: ఏపీలో కాంగ్రెస్ బలపడేనా?

AP Congress: ఏపీలో కాంగ్రెస్ బలపడేనా?

AP Congress: ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపుగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. కర్ణాటకలో ఘన విజయం సాధించిన తరువాత దక్షిణాదిలోని మరిన్ని రాష్ట్రాలపై కన్నేసినట్లు తెలుస్తుంది. త్వరంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో కొద్దో గొప్పో ప్రభావం చూపుతున్నా, ఏపీలో ఆ పార్టీకి నాయకత్వ లేమి వెంటాడుతోంది. అధికారం కోల్పోయాక చాలా మంది జారుకోగా, మరికొంత మంది పార్టీ ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ కూడా బలపడతామని చెబుతున్న ఆ పార్టీ అధిష్టానం వ్యూహమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల్లో వరుస ఓటములు చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనీసం ఓటు బ్యాంకును కోల్పోయింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసింది చాలా తక్కువ. ఒకరకంగా చెప్పాలంటే అస్సలు లేదు. రాష్ట్ర విభజన పాపం ఇంకా కాంగ్రెస్ ను వెంటాడుతూనే ఉంది. 2014 ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అయ్యింది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని భుజాన వేసుకోకపోగా, సైలెంటుగా ఉండిపోయారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రఘువీరా రెడ్డికి అప్పగించింది. ఆయన తరువాత ప్రస్తుతం గిడుగు రుద్రరాజు ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తున్న తరుణంలో కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సత్ఫలిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని తేల్చి చెప్పారు. కేంద్రంలో ప్రభావం కోల్పోతున్న బీజేపీతో ఆ పార్టీలు జతకట్టడాన్ని తప్పుబట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక ఎన్నికలు కొత్త మార్పును సూచిస్తున్నాయన్నారు.

ఏపీలో ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ చేస్తామని మాజీ ఎంపీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తొలి రెండున్నరేళ్లు ఎస్సీలకు, ఆ తర్వాత రెండున్నరేళ్లు కాపులకు సీఎం పదవి ఇస్తామంటూ ప్రకటించారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. తటస్థులను కాంగ్రెస్ వైపు మరల్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంత మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Oktelugu Epaper