Homeజాతీయ వార్తలుఅడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

అడవిలో డీజీపీ.. తెలంగాణలో ‘మావో’ల భయం?

Ts Dgp in Asifabadతెలంగాణలో అడవుల జిల్లా ఆదిలాబాద్ లో గ్రేహౌండ్స్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలో మూడు రోజులుగా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. విశేషం ఏంటంటే.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సైతం మూడు రోజులుగా ఆదిలాబాద్ లోనే ఉంటున్నారు. హెలిక్యాప్టర్ ద్వారా మొత్తం అడవులను స్వయంగా పరిశీలిస్తూ పోలీసులకు సలహాలు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తున్నారు.

Also Read: ఏపీ మంత్రి ప్రాణాలకు ముప్పు? పటిష్ట భద్రత

డీజీపీ సైతం ఆదిలాబాద్ లోని అడవుల్లోని సమస్యాత్మక ప్రాంతాలను సందర్శిస్తూ పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేస్తూ కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి డీజీపీ అయ్యిండి స్వయంగా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.

కాగా చత్తీస్ ఘడ్ , గడ్చిరోలి నుంచి మావోయిస్టులు ఆదిలాబాద్ వచ్చారని ఉప్పందింది. ప్రాణహిత నదీతీరం వెంబడి ఉన్న అటవీ ప్రాంతం గుండా వచ్చారని.. ప్రజాప్రతినిధులు, పోలీసులను టార్గెట్ చేశారని నిఘా విభాగాలు సమాచారం అందించాయి.

Also Read: హాంఫట్.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

ఒకప్పుడు తెలంగాణ వస్తే మావోయిస్టులకు కేంద్రంగా మారుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆడిపోసుకున్నారు. అలా కాకూడదని కేసీఆర్ బాగా కూంబింగ్ లు నిర్వహించి అరికట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ మూలాలు బయటపడడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి మరీ మావోల ఏరివేత ఆపరేషన్ లో పాల్గొంటుండడం సంచలనంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular