AP BJP: ఆంధ్రప్రదేశ్లో పాత కూటమి కొత్తగా ఆవిష్కృతమైంది. 2014లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాటి కాంబినేషన్ను మళ్లీ 2024లో రిపీట్ చేయాలని చూస్తున్నాయి. ఈమేరకు మూడు పార్టీల పొత్తు ఖరారైంది. 25 లోక్సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 5, జనసేనకు 3 కేటాయిస్తున్నట్లు టీడీపీ లీకు ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు, జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ప్రచారం చేస్తోంది. ఇక టికెట్లు కేటాయింపే మిగిలింది అని పేర్కొంటోంది.
ఐదు కాదు.. ఆరు అంటున్న బీజేపీ..
ఇదిలా ఉంటే బీజేపీ తాజాగా కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఏపీలో తాము ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే బీజేపీ ఏపీ చీఫ్కే లోక్సభ నియోజకవర్గం దొరకడం లేదు. వాస్తవానికి ఐదు స్థానాలకు బీజేపీ అధిష్టానం అంగీకరించినట్లు సమాచారం. కానీ, పురందేశ్వరి తన సీటు కోసం మరో నియోజకవర్గం కావాలని కోరుతున్నారు. మరో సీటు ఇవ్వకుంటే ఆమె పోటీపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. మోదీ కేబినెట్లో మంత్రి పదవి ఆశిస్తున్న పురందేశ్వరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు కూడా ఒక నియోజకవర్గం కేటాయించేలా చూడాలని ఆమె బీజేపీ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఏలూరుపై బీజేపీ గురి..
ఇక పురందేశ్వరి విన్నపం మేరకు ఆమెకు ఏలూరు లోక్సభ సీటు ఇవ్వాలని బీజేపీ టీడీపీని కోరినట్లు తెలుస్తోంది. టీడీపీ–బీజేపీ పొత్తు కుదరడంలో కీలకంగా వ్యవహరించిన పురందేశ్వరికే టికెట్ లేకుంటే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కాదనలేని పరిస్థితి నెలకొంది.
బీజేపీ పోటీ చేసే స్థానాలు ఇవీ..
తాజా సమాచారం ప్రకారం ఏపీలో బీజేపీ పోటీ చేయనున్న లోక్సభ స్థానాలు పరిశీలిస్తే..
ఏలూరు : దగ్గుబాటి పురందేశ్వరి
అనకాపల్లి : సీఎం రమేశ్
రాజమండ్రి : వైఎస్.చౌదరి అలియాస్ సుజనా చౌదరి
హిందూపురం : వి.సత్యకుమార్
రాజంపేట : నల్లారి కిరణ్కుమార్రెడ్డి
అరకు : కొత్తపల్లి గీత