తెలుగు టీవీచానళ్లలో చర్చా కార్యక్రమాలు నిర్వహించడంలో మంచి గుర్తింపు పొందిన సీనియర్ అండ్ ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు దమున్న ఓ టీవీ చానల్ నుంచి సైతం నిష్ర్కమించారు. ఆయన చానల్లోని ఉద్యోగులకు వారంరోజుల పాటు సెలవు పెడుతున్నానని చెప్పుకొచ్చారు. కానీ అది సెలవు కాదని.. శాశ్వత తొలగింపు అని మంగళవారం ఉదయం క్లారిటీ వచ్చింది. అయితే సాయంత్రానికి సోషల్ మీడియాలో కొంత మంది ఆయన రూ.50 లక్షలు బ్లాక్ మెయిలింగ్ చేసి దొరికిపోయాడని, అందుకే యాజమాన్యం తొలగించిందని ప్రచారాన్ని ఉధృతం చేశారు.
Also Read: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రైల్వేలో అప్రెంటీస్ ఉద్యోగాలు..?
ఆయనకో కులం తోక తగిలించి.. ఆయనంటే పడని రాజకీయ సోషల్ మీడియా సైతం ఈ విషయం గురించి జోరుగానే ప్రచారం చేసింది. తనపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన కూడా సోషల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతానికి సెలవు మాత్రమేనని.. తనపై ఏదేదో ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని ఆయన మండి పడ్డారు. అయితే నిజంగా సెలవే అయితే… ఆ విషయాన్ని మరింత గట్టిగా చెప్పుకునేవారు.
కానీ అంతకు మించి జరిగిందని ఆయన చేసిన ట్విట్ ద్వారా తెలిసిపోయింది. ఆ చానల్ ఆయనకు ఇచ్చిన ఫోన్ నంబర్లను కూడా తక్షణం నిలిపివేయించినట్లుగా తెలుస్తోంది. సెలవు పెడితే చానల్ అంతగా ఆయన్ను దూరం పెట్టదు. పై స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి.. గౌరవంగానే ఏ సంస్థ అయినా వ్యవహరిస్తుంది. ఆ గౌరవాన్ని పోగొట్టుకునేలా చేయడంతోనే సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. సదరు జర్నలిస్టు రూ.50 లక్షలు బ్లాక్ మెయిలింగ్ చేశాడా..? లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ సదరు చానల్ యాజమాన్యాన్ని మాత్రం ఇబ్బంది పెట్టాడని స్పష్టం అవుతోంది.
Also Read: తిరుపతిలో బీజేపీకి మరో చిక్కు.. ఆ రూ.120కోట్లు..?
చానల్ లోకి వచ్చినప్పటి నుంచి ఆయన.. తనదైన మార్క్ రాజకీయాలు చేస్తూ.. పని వాతావరణాన్ని దెబ్బతీశారని.. సదరు చానల్లో పనిచేసేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పెద్ద ఎత్తున పెద్ద మనషుల్ని అన్ని డిపార్టుమెంటుల్లోకి తెచ్చి పెట్టుకోవడానికి.. చాలా మంది పాత ఉద్యోగులను తొలగించారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆయన గతంలో ఎక్కడ పనిచేసినా.. అదే పరిస్థితి అనే వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి మీడియా రంగంలో మరో కీలకమైన మార్పు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్