Homeఆంధ్రప్రదేశ్‌Revanth - Chandrababu : రేవంత్, చంద్రబాబు కు సుప్రీంకోర్టు షాక్..

Revanth – Chandrababu : రేవంత్, చంద్రబాబు కు సుప్రీంకోర్టు షాక్..

Revanth – Chandrababu : మనదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే లంచాలు తీసుకోవడమనేది నేరం. కానీ వాటిని తీసుకోకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు. అలాంటివారిని పట్టుకునేందుకు ఏసీబీ లాంటి వ్యవస్థలున్నాయి. మరి లంచాలు తీసుకునే రాజకీయ నాయకులను పట్టుకునేందుకు ఎలాంటి వ్యవస్థలూ మన దేశంలో లేవు. అందుకే రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకుంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసులో రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారం, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎదుర్కొంటున్నది కూడా అలాంటి కేసే. ఆమధ్య పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఎదుర్కొన్న ఆరోపణలు కూడా అలాంటివే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో ఒకరకంగా రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలినట్టయింది.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులో కీలక తీర్పు ప్రకటించింది. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కేసులో ఇమ్మ్యు నిటీ కల్పిస్తూ గతంలో మెజారిటీ న్యాయవాదులు తీర్పు ఇచ్చారు. అయితే తీర్పును చంద్ర చూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కొట్టేసింది.”శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. అలాంటివారు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలి. అంతేతప్ప లంచం తీసుకొని భారత ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేయకూడదని” సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. “ప్రజా ప్రతినిధి లంచం ఎలా తీసుకుంటారు? అలా లంచం తీసుకోవడానికేనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయింది? లంచం తీసుకొని శాసనసభ లేదా లోక్ సభ లో మాట్లాడటం సరైనది కాదు. అలాంటి తాయిలాలకు అలవాటు పడి ఓటు వేయడం సరైన చర్య కాదని” సుప్రీంకోర్టు ధర్మాసనం లోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎం ఎం సుందరిష్, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రా పేర్కొన్నారు.

గతంలో ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారని ఆరోపణలపై ఎమ్మెల్యేకు మినహాయింపు ఇస్తూ పివి నరసింహారావు కేసులో అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు విస్తృత పరిణామాలను కలిగి ఉందని డివై చంద్ర చూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దీనిని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. శాసన విధులు నిర్వర్తించేందుకు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మినహాయింపు ఎందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. పీవీ నరసింహారావు కేసులో అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 105/194 కు విరుద్ధంగా ఉందని చంద్రచూడ్ ఆధ్వర్యంలో ధర్మాసనం ప్రకటించింది. శాసన అధికారాలను కచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు గుర్తుపెట్టుకోవాలని సూచించింది. అధికారం అంటే అడ్డగోలుగా వ్యవహరించడం కాదని.. అలాంటి అధికారాలు చట్టసభ కూడా ఉంటాయని స్పష్టం చేసింది.105/194 అధికరణ సభ్యులకు విచ్చలవిడి వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. అవినీతి అనేది రాచ పుండని.. శాసనసభ్యులు లంచం తీసుకోవడం పార్లమెంటరీ పనితీరును.. ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన తీర్పు రాజ్యసభ కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే.. అది కూడా అవినీతి నిరోధక చట్టం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper