spot_img
Homeజాతీయ వార్తలుపార్టీల పాదయాత్ర బాట

పార్టీల పాదయాత్ర బాట

padayatra
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసి రెండేండ్లైనా గడవలేదు. ఈ పాలన ఇంకా సగం కూడా పూర్తికాలేదు. అప్పుడే మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అంతేకాదు.. అప్పుడే అధికారంలోకి ఎలా రావాలో ప్లాన్‌లు చేస్తున్నాయి. ఇందుకు ముఖ్యంగా పాదయాత్రలతో సక్సెస్‌ అవ్వాలని చూస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్‌మోహన్‌రెడ్డి పాతయాత్రలు చేపట్టి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

Also Read: ఓవైపు కరోనా.. మరోవైపు తిరుమల వెంకన్న..!

తెలంగాణలో టీఆర్ఎస్‌కు మరోసారి ప్రజులు ఓట్లు వేయరన్న గట్టి నమ్మకంతో ఉన్న ప్రతిపక్ష పార్టీలు.. ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ పార్టీకి బలమైన నేత ఉంటే.. ఆ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ బలాన్ని నేతలు పెంచుకునేందుకు పాదయాత్ర బాట పడుతున్నారు. తెలంగాణలో దూకుడు మీద ఉన్న బీజేపీ.. ఇప్పుడు కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కొత్తగా బాధ్యతలు తీసుకుని బీజేపీకి ఎప్పుడూ లేనంత ఊపు తీసుకొచ్చి పెట్టిన బండి సంజయ్.. మొదట బస్సు యాత్ర చేయబోతున్నారు. నియోజకవర్గాలు అన్ని తిరిగిన తర్వాత.. ఆయన పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోనే ప్రణాళిక సిద్ధమవుతోందని అంటున్నారు.

జమిలీ ఎన్నికల ఛాన్స్‌ కూడా ఉండడంతో బండి సంజయ్ పాదయాత్ర తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల వేడి ప్రారంభమయ్యే నాటికి పాదయాత్ర.. ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

Also Read: ఈ కొత్త వైరస్‌ ఎలా వచ్చిందో తెలుసా..?

ఇక కాంగ్రెస్ నేతలూ పాదయాత్ర ఆలోచనే చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా కూడా పాదయాత్ర చేసి మరింత దగ్గరకు కావాలని యోచిస్తోంది. అంతేకాదు.. టీ పీసీసీ అధ్యక్షుడిని మరో వారంలో ప్రకటించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేదా రేవంత్ రెడ్డి ఎవరు పీసీసీ చీఫ్ అయినా వారి ప్రథమ ప్రాధాన్యం పాదయాత్రకేనట. రేవంత్ రెడ్డి తన ప్రణాళికను ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు సమర్పించారు. తాను పార్టీకి పునర్‌వైభవం ఎలా తెస్తారనే నివేదిక ఇచ్చారు. అందులో పాదయాత్ర కీలకం. అలాగే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ పోస్ట్ ఇస్తే పాదయాత్ర చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. అంటే ఇద్దరి ప్లాన్లు పాదయాత్రనే. పాదయాత్ర ద్వారా ప్రజల్ని ఆకట్టుకుని..తమ బలాన్ని పెంచుకోవడంతో పాటు.. ప్రజల్ని ఆకట్టుకోవచ్చని నమ్ముతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Oktelugu Epaper