రాష్ట్రంలో వైద్యులకు కూడా మాస్కులు అందని పరిస్థితి నెలకొందని, ఒక్క మాస్క్ ని ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారని నర్సీపట్నం సీనియర్ వైద్యుడు సుధాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో సోమవారం మాట్లాడారు.
నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని, పరిస్థితి అంత విషయంగా ఉందని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే 150 పడకల ఆసుపత్రి అని, కనీస సౌకర్యాలు కరువయ్యాయని చెప్పారు. ఒక్క మాస్కు ఇచ్చి దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారని తెలిపారు. ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరన్నారు. ఆసుపత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నామని, అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారని చెప్పారు. ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలని కోరారు. కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: One mask use 15 days
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com