
అటొచ్చి.. ఇటొచ్చి.. కాంగ్రెస్కు మళ్లీ రాహుల్ గాంధీనే దిక్కయినట్లు ఉన్నాడు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మళ్లీ రాహుల్ చేతికే వచ్చేలా కనిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత సీనియర్లపై అలిగిన రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు వదిలేశారు. తాను మళ్లీ తీసుకునేది లేదంటూ భీష్మించారు. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకూ ఆమె ఉన్నారు. అయితే ఇప్పుడు.. కాంగ్రెస్లో పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతుండటంతో పూర్తి స్థాయి అధ్యక్ష పదవిని భర్తీ చేయాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి.
Also Read: అమ్మ మాటే శాసనం.. రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు..!
మరోవైపు సీనియర్లు కూడా రెబల్స్గా మారారు. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయాలంటే అధ్యక్షుడు ఉండాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. చివరికి రాహుల్ గాంధీ పార్టీ కోసం పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమిస్తే రాహుల్ సూపర్ ప్రెసిడెంట్గా వ్యవహరించాల్సి ఉంటుంది. అది మరికొన్ని కొత్త సమస్యలకు కారణం అవుతుంది.
Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ
ప్రస్తుతం పార్టీలో గాంధీ విధేయులు ఓ వర్గంగా ఉన్నారు. పార్టీని గాంధీ కుటుంబంతో సంబంధం లేకుండా నడపాలని మరో వర్గం వాయిస్ వినిపిస్తోంది. అయితే రెండో వర్గం పరిమితంగానే ఉండడంతో పెద్దగా పట్టించుకునే వారు లేరు. వారిలోనూ ప్రజా క్షేత్రంలో నెగ్గుకొచ్చేవారు తక్కువ. దాంతో వారికి పెద్దగా బలం లేకుండా పోయింది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
రాహుల్ అస్త్ర సన్యాసం చేసినప్పుడు ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ పార్టీలో కూడా వినిపించింది. 2024 ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే పార్టీ మెరుగుపడుతుందని అప్పట్లో డిమాండ్ కూడా చేశారు. కానీ.. ఇప్పుడు మళ్లీ అందరూ రాహుల్ మాటే వినిపిస్తున్నారు. పార్టీలో మాత్రం ప్రియాంక, రాహుల్ కలిసి పనిచేస్తే పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పగ్గాలు మరోసారి రాహుల్ చేతికే చిక్కబోతున్నాయనేది మాత్రం స్పష్టం అవుతోంది.