నిర్భయ దోషులకు ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నాలుగో డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20,2020 ఉదయం 5గంటల 30నిమిషాలకు నలుగరు నిందితులను ఒకేసారి ఉరితీయనున్నారు. అయితే ఈ విషయంపై దోషుల కుటుంబసభ్యులు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. దోషులను యుథనేసియా (నొప్పిలేకుండా) పద్దతిలో ఉరి తీయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
నలుగురు దోషుల కుటుంబసభ్యుల నుంచి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు 13లెటర్లు వచ్చాయి. ఇందులో రెండు లెటర్లను నిందితుల్లో బకడైన ముఖేష్ కుటుంబసభ్యులు పంపించినవి కాగా,మరో నిందుతుడైన అక్షయ్ కుటుంబస్యభులు పంపినవి 3లెటర్లు ఉన్నాయి. ఇక మిగిలిని ఇద్దరు నిందితులు పవన్,వినయ్ ల కుటుంబసభ్యులు ఒక్కొక్కరు నాలుగేసి చొప్పున రాష్ట్రపతికి లేఖలు పంపారు. ఆ లేఖలలో దోషులను మెర్సీ కిల్లింగ్ (దయతో నొప్పి లేకుండా చంపే) పద్దతిలో శిక్షను అమలు చేయని పేర్కొన్నారు.