ఆంధ్రప్రదేశ్ లో స్థానిరమేష్ కుమార్ వెల్లడించారు. కరోనా కారణంగా ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ ఈసీ రమేష్ కుమార్.
దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రమేష్ కుమాక ఎన్నికల పోరు మరో కోణంలో వెడ్డెక్కాయి. 2020 స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్నికల కమిషనర్ ర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని జగన్ ఫైర్ అయ్యారు. విచక్షణాధికారం అనే పదం వాడటం ప్రతిఒక్కరికి అలవాటైపోయిందని మండిపడ్డారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన అధికారి..ఇలా టీడీపీకి వత్తాసు పలకడం దారుణం అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు వైరస్ ఉందని పేర్ని నాని, నారావారి గబ్బిలం అని విజయ సాయి రెడ్డి రమేష్ కుమార్ ని వ్యక్తిగతంగా విమర్శలు చేశారు.
ఎన్నికల వాయిదా వివాదాన్ని సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. దీంతో స్థానిక ఎన్నికల వాయిదా పంచాయతీ గవర్నర్ దగ్గరకు చేరింది.
రమేష్ కుమార్ గవర్నర్ కు ఎలాంటి రిపోర్టు ఇస్తారు? తన నిర్ణయాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అనేది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సీఎం జగన్ తీవ్ర ఆరోపణల తర్వాత రమేష్ కుమార్ గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల కమిషనర్ వివరణ తర్వాత గవర్నర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ap local body elections postpone jagan response
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com