spot_img
Homeజాతీయ వార్తలుMission Chanakya Survey: తెలంగాణలో మిషన్‌ చాణక్య సర్వే.. ఆ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం

Mission Chanakya Survey: తెలంగాణలో మిషన్‌ చాణక్య సర్వే.. ఆ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం

Mission Chanakya Survey: తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఒకవైపు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు అన్ని పార్టీలు నువ్వా ? నేనా? అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టాయి. ఈసారి ఎలాగైనా అధికారం తమదేనని హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ రికార్డు సృష్టించనున్నారంటూ.. బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా.. బీఆర్‌ఎస్‌ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈసారి అధికారం కచ్చితంగా తమదే అంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో డజన్ల కొద్దీ సర్వే సంస్థలు ఒపీనియన్‌ పోల్‌ పేరుతో రిపోర్టులను గుప్పిస్తున్నాయి. ఒక్కో సంస్థ అంచనాలు ఒక్కో తీరులో ఉంటున్నాయి. తాజాగా.. మిషన్‌ చాణక్య ఆసక్తికర సర్వే ఫలితాలు వెల్లడించింది.

బీఆర్‌ఎస్‌కే అధికారం..
మిషన్‌ చాణక్య సర్వే నా రాష్ట్రం.. నా ఓటు.. నా నిర్ణయం పేరుతోతో సరే ఫలితాలను విడుదల చేసింది. ఇందులో బీఆర్‌ఎస్‌కు68 నుంచి 74 సీట్లు వస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక బీజేపీకి కేవలం 2 నుంచి 5 స్థానాలే వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌ 24 నుంచి 32 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్‌ఎస్‌ ఎనిమిది నుంచి 15 స్థానాలు నష్టపోతుందని, బీజేపీ మూడు నుంచి ఐదు స్థానాల్లో లాభపడుతుందని, కాంగ్రెస్‌ కూడా 10 స్థానాల వరకు అదనంగా గెలుస్తుందని వెల్లడించింది.

ఓట్ల శాతం ఇలా..
మిషన్‌ చాణక్య సర్వే ప్రకారం.. బీఆర్‌ఎస్‌కు 44.62%, కాంగ్రెస్‌కు 32.71%, బీజేపీకి 17.6% ఓటింగ్‌ వస్తుందని వెల్లడించింది. బీజేపీ పార్టీ హైదరాబాద్‌ కంటే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ సెగ్మెంట్లలో బలంగా ఉందని సర్వేల్లో తేలింది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ హైదరాబాద్‌లో బలంగా తయారైందని సర్వే రిపోర్టుల తేలింది.

సీఎంగా కేసీఆర్‌కే ఓటు..
ఇక ఈ సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందన్న విషయంలో అత్యధికంగా కేసీఆర్‌కు 56.41 శాతం మంది ఓటేశారు. రేవంత్‌రెడి 24.5 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక బీజేపీ ప్రకటించిన బీసీ సీఎం నినాదం ఆ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తుందని సర్వే సంస్థ తేల్చింది. 12.5 శాతం బీజేపీ బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు కేవలం 2 శాతం మద్దతు ఇచ్చారు.

వయసుల వారీగా ఓటింగ్‌ ఇలా..
మిషన్‌ చాణక్య సర్వే అభ్యర్థులు, ఓటర్ల వయసుల వారీగా కూడా ఓట్ల శాతం అంచనా వేసింది. 18 నుంచి 25 ఏళ్లలోపు వారి ఓట్లకు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు 36.45, బీజేపీకి 24.18, కాంగ్రెస్‌కు 28.45 శాతం మంది మద్దతు ఇస్తున్నారు. ఇతరులకు 10.89 శాతం మద్దతు ఉంది.

– 26 నుంచి 35 ఏళ్లలోపు వారి ఓట్లలో బీఆర్‌ఎస్‌కు 39.65, బీజేపీకి 19..78, కాంగ్రెస్‌కు 33.65 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

– 36 నుంచి 45 ఏళ్లలోపు వారి ఓట్లలో బీఆర్‌ఎస్‌కు 40.68, బీజేపీకి 15.29, కాంగ్రెస్‌కు 40.71 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

– 46 నుంచి 55 ఏళ్లలోపు వారి ఓట్లలో బీఆర్‌ఎస్‌కు 45.13, బీజేపీకి 13.35, కాంగ్రెస్‌కు 33.31 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

– 56 నుంచి 65 ఏళ్లలోపు వారి ఓట్లలో బీఆర్‌ఎస్‌కు 46.51, బీజేపీకి 8.88, కాంగ్రెస్‌కు 35.62 శాతం మంది మద్దతు ఇస్తున్నారు.

– 65 ఏళ్లు పైబడిన వారిని చూస్తే.. 48.37 శాతం బీఆర్‌ఎస్‌కు, 37.27 శాతం కాంగ్రెస్‌కు, బీజేపీకి 7.13 శాతం మద్దతు ఇస్తున్నట్లు సర్వే సంస్థ వెల్లడించింది.

పురుషుల్లో బీఆర్‌ఎస్‌కు 36.64, బీజేపీకి 17.46. కాంగ్రెస్‌కు 35.73 శాతం మద్దతు ఇస్తున్నారు. మహిళల్లో 49.28 బీఆర్‌ఎస్‌కు 12.28 బీజేపీకి, 32.90 కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular