Homeజాతీయ వార్తలుకేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది?

కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది?

tcongress

కేసీఆర్ సిక్సర్ కొట్టాడు.. రెండో దఫా మొదటి ఏడాదిని రేపటితో పూర్తి చేసుకోబోతున్నాడు. జూన్ 2తో తెలంగాణ పాలన ఆరేళ్ల క్రితం కేసీఆర్ సీఎంగా ప్రమాణంతో మొదలైంది. ఈ ఆరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించి అభివృద్ధి పథాన తెలంగాణ పయనించింది. ఆరేళ్ల సంబురానికి కొత్త రాష్ట్రం రెడీ అవుతున్న వేళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ ను ఢీకొట్టలేకపోతోంది. ఇప్పటికీ పీసీసీ చీఫ్ కోసం సీనియర్లు మంకు పట్టు పట్టి తగవులాడుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ కు వత్రం చెడ్డా ఫలితం దక్కలేదు. మొన్నటిసారి చుక్కెదురైంది. మరి కాంగ్రెస్ ను తెలంగాణలో నిలబెట్టే మగాడెవరు? అన్న ఆలోచనలు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను ఢీకొనే శక్తి టీకాంగ్రెస్ లో ఎవరికి ఉంది అని చర్చించుకుంటున్నారు..

*ఉత్తమ్ పని అయిపోయింది..
తెలంగాణలో గడిచిన ఐదేళ్లలో పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించలేదు. పైగా తన సొంత నియోజకవర్గం హుజూర్ నగర్ లో కూడా ఓడిపోయి పీసీసీ చీఫ్ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజల సానుభూతి వల్ల మూడు ఎంపీ సీట్లు దక్కి చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా కాంగ్రెస్ పరువు దక్కింది. ఇప్పుడు కరోనా-లాక్ డౌన్ ముగిస్తే మొదట కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడి మార్పే మొదటి ప్రియారిటీగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

*రేవంత్ రెడ్డి అందరికంటే ముందు..
తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ చీఫ్ రేసులో అందరికంటే ముందు రేవంత్ రెడ్డియే ఉన్నాడు. ఇటు పార్టీ యువ కేడర్ లో.. నేతల్లో రేవంత్ కు మేనియా పీక్స్ లో ఉంది. మాస్ లీడర్ గా గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డినే చేయాలని ఉబలాటపడుతోంది. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీసీ చీఫ్ ను చేయడానికి వీల్లేదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.. కానీ కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడిగా తెలంగాణలో కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఆ పేరుంది. వాగ్ధాటిలో, నాయకత్వశైలిలో రేవంత్ అందరికంటే ముందున్నారు.

*కోమటిరెడ్డిపై శీతకన్ను
నిజానికి ఉత్తమ్ తర్వాత అత్యంత బలంగా కనిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనకు పీసీసీ చీఫ్ ఇవ్వండి టీఆర్ఎస్ లోని 50 మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని అంటున్నాడు. కానీ ఆయన తమ్ముడు బీజేపీకి సపోర్టు చేయడం.. నిలకడలేని రాజకీయం వల్ల కోమటిరెడ్డిని నమ్మేస్థితిలో అధిష్టానం లేదన్న వాదన వినిపిస్తోంది.

*వీహెచ్, జీవన్ రెడ్డి , జగ్గారెడ్డి, జానాలకు డౌటే
పేరు మోసిన కాంగ్రెస్ కురువృద్ధులైన వీ హనుమంతరావు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డిలకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడం డౌటే అన్న చర్చ పార్టీలో సాగుతోంది. వీరు పార్టీని ముందుండి నడిపించలేరనే అభిప్రాయం ఉంది. అందుకే ఈ రేసు నుంచి సీనియర్లను పక్కనపెట్టారనే చర్చ సాగుతోంది.

*భట్టి, శ్రీధర్ బాబులకు ఇచ్చేనా?
ఇక రేవంత్ రెడ్డికి వద్దనుకుంటే రేసులో దళిత నేత మల్లు భట్టివిక్రమార్క్, మరోనేత శ్రీధర్ బాబుల పేరు వినిపిస్తోంది.కానీ వీరికి రేవంత్ రెడ్డిలా మాస్ ఫాలోయింగ్ లేకపోవడం.. వీరికి అప్పగించినా పెద్దగా పురోగతి ఉండదన్న అభిప్రాయాలు పార్టీలో ఉంది.

మిగతా నేతలున్నా కూడా పీసీసీ బరిలో వీరి పేర్లే వినిపిస్తున్నాయి. మొత్తంగా అందరిలోకి రేవంత్ రెడ్డి బలంగా కనిపిస్తున్నా.. కేసీఆర్ ను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలున్నా.. ఆయన ఆ పీఠం ఎక్కనీయకుండా సీనియర్లు అడ్డుపడుతున్నారు. మరి ఈ పీఠాన్ని అధిష్టానం ఎవరికి ఇస్తుందనేది వేచిచూడాల్సిందే..

–నరేశ్ ఎన్నం

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular