spot_img
Homeజాతీయ వార్తలుIsrael And India: భారత్‌ కు ఇజ్రాయెల్‌ మెషీన్‌గన్స్‌... ప్రత్యేకత ఏంటో తెలుసా..

Israel And India: భారత్‌ కు ఇజ్రాయెల్‌ మెషీన్‌గన్స్‌… ప్రత్యేకత ఏంటో తెలుసా..

Israel And India: ప్రపంచంలో కొన్నేళ్లుగా భారత్‌ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నాం. దీంతో మనకు శత్రువులు పెరుగుతున్నారు. మన ఎదుగుదలను ఓర్వడం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాలు మనల్ని కిందకు లాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో భారత్‌ కూడా సైనికంగా బలపడుతోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఆయుధాలు తయారు చేస్తోంది. మరోవైపు భారత్‌ విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌తో డీల్‌ కుదిరింది.

40 వేల మెషీన్‌ గన్స్‌..
ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ (ఐడబ్ల్యూఐ) ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో దాదాపు 40 వేల లైట్‌ మెషిన్‌ గన్స్‌ భారత సైన్యంకు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఆయుధాల సరఫరా కోసం సంబంధిత పరీక్షలు, అనుమతులు పూర్తయ్యాయి. భారత హోంశాఖతో ఈ ఒప్పందం చర్చలను చేపట్టిన ఐడబ్ల్యూఐ త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

1.70 లక్షల కార్బైన్లపై ఒప్పందం..
క్లోజ్‌ క్వార్టర్స్‌ బ్యాటిల్‌ (సీక్యూబీ) కార్బైన్స్‌ టెండర్లో భారత్‌ ఫోర్జ్‌ ప్రాథమిక బిడ్డర్‌ కాగా, ఐడబ్ల్యూఐ సంస్థ రెండో స్థానంలో ఉంది. 1.70 లక్షల కార్బైన్‌ ఆయుధాల సరఫరా ఒప్పందం నాటికి సంతకాలతో పూర్తవుతుంది. అందులో 60 శాతాన్ని భారత్‌ ఫోర్జ్, మిగతా 40 శాతాన్ని అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్‌ సిస్టమ్స్‌ పంపిణీ చేసే అవకాశం ఉంది.

అర్బెల్‌ టెక్నాలజీ..
అర్బెల్‌ సాంకేతికత అనేది వరల్డ్‌లో ప్రథమ కంప్యూటరైజ్డ్‌ రైఫిల్‌ సిస్టమ్‌. ఇందులో ఉన్న అధునాతన సెన్సర్లు, రియల్‌ టైమ్‌ బాలిస్టిక్‌ కమ్యూటేషన్‌ సామర్థ్యం ద్వారా సైనికులు అత్యధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలరు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్‌ సిస్టమ్‌ అల్గోరిథంతో ఈ టెక్నాలజీ ఆయుధం లక్ష్యాన్ని వేగంగా, తీక్షణంగా గుర్తించి తదుపరి నిషేధాలు కూడా ఆ నిర్వహణను మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది.

భారతదేశంలో తయారీ ప్రణాళిక..
ఐడబ్ల్యూఐ సీఈవో షుకీ స్క్వాట్జ్‌ ప్రకారం, ఈ ఆధునిక ఆయుధాల బ్రాహత్‌ లో కూడా తయారీకి దారులు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తద్వారా దేశీయ నిర్వాహణ సామర్థ్యం పెరిగి, సైనిక సామర్థ్యం మరింత బలపడనుంది.

భారత సైన్యంలో ఈ ఆధునిక ఆయుధాల ప్రవేశంతో యుద్ధవేదికపై సంచలనం సృష్టించే అవకాశం ఉంది. దేశ రక్షణకు కొత్త మైలురాయి వేసే పథకం అనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper