Homeజాతీయ వార్తలుIndia-Pakistan : సాగర దిగ్బంధం.. దాయాది వెన్నులో వణుకు!

India-Pakistan : సాగర దిగ్బంధం.. దాయాది వెన్నులో వణుకు!

India-Pakistan  : పహల్గాం ఘటన భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం, వారి వెనుక పాకిస్థాన్‌ఉండడం.. భారత్‌ ఆగ్రహానికి కారణమైంది. ముష్కరులకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు భారత్‌ సర్వం సన్నద్ధమైంది. సైన్యం, ఎయిర్‌ ఫోర్స్‌తోపాటు నావికాదళం కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఎదుక్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌ వెన్నులో వణుకు పుట్టేలా త్రివిధ దళాలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా భారత నౌకాదళం పాకిస్తాన్‌ను సాగర దిగ్బంధం చేస్తోంది.

Also Read : పాకిస్థాన్‌ నుంచి తిరిగి వస్తున్న భారతీయులు.. ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారంటే..

భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్‌ (మీడియం రేంజ్‌ సర్ఫేస్‌–టు–ఎయిర్‌ మిసైల్‌) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి సముద్రతీరానికి చేరువగా దూసుకొచ్చిన లక్ష్యాన్ని కచ్చితంగా ధ్వంసం చేసింది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్‌ క్షిపణులను నాశనం చేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ పరీక్ష భారత నౌకాదళం యొక్క ఆధునిక యుద్ధ సన్నద్ధతను, సముద్ర రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది.
సముద్రంలో ఆధిపత్యం
విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. వీటిని జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లతో కూడిన శక్తిమంతమైన సమూహం, అంటే క్యారియర్‌ బ్యాటిల్‌ గ్రూప్‌ (సీబీజీ), మద్దతు ఇస్తుంది. ఈ గ్రూప్‌ సముద్రంలో విస్తత ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించగలదు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ వంటి విమానవాహక నౌకలు ఈ సీబీజీలో కీలక పాత్ర పోషిస్తాయి, వాయు, ఉపరితల, సముద్రగర్భ దాడులను సమన్వయంతో నిర్వహిస్తాయి.

పాకిస్థాన్‌పై దిగ్బంధం సాధ్యమేనా?
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, అరేబియా సముద్రంలో మోహరించడం పాకిస్థాన్‌లో ఆందోళన కలిగిస్తోంది. ఈ విమానవాహక నౌక పాకిస్థాన్‌ యొక్క వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌లను దిగ్బంధం చేసే సామర్థ్యం కలిగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్థాన్‌ వాణిజ్యంలో 60 శాతానికి పైగా ఈ రేవుల ద్వారానే జరుగుతుంది, అలాగే 85 శాతం చమురు దిగుమతులు సముద్ర మార్గంలోనే సాగుతాయి. దిగ్బంధం వల్ల పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల కొరత, అలాగే మూడోవంతు విద్యుత్‌ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడవచ్చు.

విక్రాంత్‌ యొక్క యుద్ధ సామర్థ్యం
ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మిగ్‌–29కె ఫైటర్‌ జెట్లు, కామోవ్‌–31 హెలికాప్టర్లతో సహా 40 యుద్ధ విమానాలను మోహరించగలదు. ఇది 64 బరాక్‌ క్షిపణులు, బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ క్షిపణులు, ఒటోబ్రెడా 76 ఎంఎం గన్స్, ఏకే–630 క్లోజ్‌–ఇన్‌ ఆయుధ వ్యవస్థలతో శక్తిమంతంగా ఉంది. ఈ నౌక శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. మిగ్‌–29కె జెట్లు 850 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలవు, పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. భారత వాయుసేనతో సమన్వయంతో దాడులు చేస్తే, పాకిస్థాన్‌ యొక్క సైనిక ఆదేశిక వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు.

పాక్‌ నేవీతో పోలిస్తే భారత్‌ ఆధిపత్యం
భారత నౌకాదళం ముందు పాకిస్థాన్‌ నేవీ సామర్థ్యం చాలా బలహీనంగా ఉంది. భారత్‌ వద్ద విమానవాహక నౌకలు, అణు జలాంతర్గాములు, ఆధునిక యుద్ధనౌకలు ఉండగా, పాకిస్థాన్‌ వద్ద చైనా తయారీ టైప్‌–054ఏ/పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్‌ కార్వెట్లు, హంగోర్‌ తరగతి జలాంతర్గాములు ఉన్నాయి, అయితే ఇవి ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. భారత నౌకాదళం ఆధునికీకరణ శరవేగంగా సాగుతుండగా, పాకిస్థాన్‌ నేవీ నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో, భారత నౌకా దిగ్బంధాన్ని తట్టుకునే సామర్థ్యం పాక్‌ నేవీకి లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

1971 యుద్ధంలో విక్రాంత్‌ వీరగాథ
1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్‌)లోని చిట్టగాంగ్, కాక్స్‌ బజార్, ఖుల్నా నగరాలపై దాడులు చేసి, పాక్‌ నౌకాదళ సరఫరాలను అడ్డుకుంది. పాకిస్థాన్‌ ఈ నౌకను ధ్వంసం చేసేందుకు పీఎన్‌ఎస్‌ ఘాజీ జలాంతర్గామిని రంగంలోకి దించగా, భారత నేవీ తెలివిగా ఐఎన్‌ఎస్‌ రాజ్పుత్‌ను విక్రాంత్‌గా పొరబడేలా చేసి, ఘాజీని జలసమాధి చేసింది. ఈ ఘటన పాక్‌ నౌకాదళానికి పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది.

కరాచీపై చారిత్రక దాడులు
1971 యుద్ధంలో భారత నౌకాదళం కరాచీ రేవుపై చేపట్టిన ఆపరేషన్‌ ట్రైడెంట్, ఆపరేషన్‌ పైథాన్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. డిసెంబర్‌ 4, 1971న కిల్లర్‌ స్క్వాడ్రన్‌ క్షిపణి నౌకలు పాక్‌ యుద్ధనౌకలైన పీఎన్‌ఎస్‌ ముహాఫిజ్, పీఎన్‌ఎస్‌ ఖైబర్, సరఫరా నౌక ఎంవీ వీనస్‌లను ముంచాయి. కరాచీలోని చమురు ట్యాంకులు, ఇంధన నిల్వలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్‌ పైథాన్‌లో మరిన్ని సరకు రవాణా నౌకలు, ఇంధన ట్యాంకర్‌ పీఎన్‌ఎస్‌ ఢాకా దెబ్బతిన్నాయి. ఈ దాడులు పాక్‌ నేవీ ఇంధన నిల్వల్లో 50 శాతాన్ని నాశనం చేసి, భారత విజయానికి బాటలు వేశాయి.

ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నుంచి ఎంఆర్‌శామ్‌ క్షిపణి పరీక్ష, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోహరింపు భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటాయి. సముద్ర రక్షణ, దిగ్బంధం, దాడి సామర్థ్యాలతో భారత్‌ పాకిస్థాన్‌పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1971 యుద్ధంలో విక్రాంత్, కరాచీ దాడుల చరిత్ర ఈ శక్తిని గతంలోనూ నిరూపించింది. ఆధునిక ఆయుధాలు, వ్యూహాత్మక సామర్థ్యాలతో భారత నౌకాదళం జాతీయ భద్రతను మరింత బలోపేతం చేస్తోంది.

Also Read : పహల్గామ్ ‘హీరో’ రయీస్ అహ్మద్ భట్ ఎవరు? అక్కడ ఆయన చూసిన వాస్తవాలు ఏంటి?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper