spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ABN RK Vs Jagan: జగన్ కు ఆంధ్రజ్యోతి ఎలా మేలుచేస్తోంది

ABN RK Vs Jagan: జగన్ కు ఆంధ్రజ్యోతి ఎలా మేలుచేస్తోంది

ABN RK Vs Jagan: మీడియాలో.. ఎల్లో మీడియా తీరే వేరు. నిద్ధరలేస్తే గిట్టని ప్రభుత్వాలు, పార్టీలపై విష ప్రచారానికి దిగడం ఈ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తుంటాయి. టీడీపీకి, చంద్రబాబుకు, కమ్మ సామాజికవర్గానికి ఇంపైన వార్తలతోనే కప్పేస్తుంటాయి.సొంత సామాజికవర్గాన్ని పైకిలేపడం.. ఇతర సామాజికవర్గాల వారిని నొక్కి పాతరేయడం ఈ యాజమాన్యాలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దశాబ్దాలుగా మీడియా ముసుగులో ‘ఎల్లో’ గుత్తాధిపత్యం కొనసాగుతునే ఉంది.

అయితే ఎన్నిరకాల విష ప్రచారాలు చేసినా అధిగమించారు ఏపీ సీఎం జగన్. ఎల్లో మీడియా వ్యూహాలకు మించి బుర్రకు పదును పెడుతున్నారు. చివరకు వారు రాసే విషపు రాతలను.. పూలజల్లుగా మార్చుకుంటున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలన్నది జగన్ ప్లాన్. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు అందులో భాగంగానే. అయితే అడుగడుగునా ఎల్లో మీడియా అడ్డుతగులుతోంది. తమ రాతలతో ప్రజల్లో జగన్ ను పలుచన చేయ్యాలని చూసింది. కానీ అవే రాతలను తనకు అనుకూలంగా మార్చుకున్న నేర్పరి, టెంపరితనం జగన్ ది.

అమరావతి రాజధాని నిర్మాణాకి రూ.4.50 లక్షల కోట్లు అవసరమని నాడు చంద్రబాబు ప్రకటించారు. తాత్కాలికంగా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడితే చాలూ అమరావతి తనంతట తానే ఆదాయం తెచ్చుకుంటుందని నాడు చంద్రబాబు ప్రకటించారు. ఎల్లో మీడియా అప్పట్లో దీనినే హైలెట్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాతలనే ఆధారంగా చేసుకున్నారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత ఖర్చు భరించే స్థితిలో లేదని ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు కూడా అటువంటి రాతలతోనే ఆంధ్రజ్యోతి పాటు ఎల్లో మీడియా జగన్ కు ఎంతో మేలు చేస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. అసలు బ్యాంకులే రుణాలు ఇవ్వకుంటే తాను అమరాతిని ఎలా కట్టగలనన్న జగన్ వాదనకు సమర్థిస్తూ కథనం రాసినట్టుంది. ఇంతకు ముందు అమరావతి భూముల వేలం సమయంలో సైతం… కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పట్లో కూడా అదే వార్తను హైలెట్ చేసింది. జగన్ వైఫల్యాలను చెప్పే క్రమంలో రాతలు రాసినా.. ఆ వార్తలతోనే న్యాయస్థానంలో ఉపశమనం పొందే విధంగా .. జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎల్లో మీడియా తెలియకుండానే ఇలా జగన్ ట్రాప్ లో పడుతుండడం విశేషం.

ఆంధ్రజ్యోతి విషపు రాతలు టీడీపీ శ్రేణులకు ఇంపుగా కనిపిస్తుంటాయి. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం మరింత వరస్ట్ గా ఉంటుందని కొందరు సీనియర్లకు మాత్రమే తెలుసు. అయితే వారి మాట చెల్లుబాటు కాని దుస్థితి. తెలుగు నాట చంద్రబాబు స్థాపించిన టీడీపీ అనుకూల మీడియా బలంగా ఉంది. విచ్చలవిడిగా అది బట్టలిప్పి రెచ్చిపోతూనే ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి బలమైన టీడీపీ మీడియా ధాటికి వైసీపీ, జగన్ కూడా నిలవలేకపోతోందన్న భ్రమల్లోనే టీడీపీ ఉంది. కానీ అది అంతిమంగా పార్టీకి నష్టం చేస్తోందని టీడీపీ శ్రేణులు ఊహించలేకపోతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper