Homeజాతీయ వార్తలుGautham Adani: నేరం రుజువైతే గౌతమ్ అదానీకి 20 ఏళ్లు జైలు శిక్ష తప్పదా?

Gautham Adani: నేరం రుజువైతే గౌతమ్ అదానీకి 20 ఏళ్లు జైలు శిక్ష తప్పదా?

Gautham Adani: భారత పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ కోసం 265 బిలియన్ డాలర్లు అనగా దాదాపుగా రూ.2200 కోట్లు లంచంగా అదానీ అమెరికా ఇన్వెస్టర్లకు ఇచ్చినట్లు న్యూయార్క్‌లో కేసు నమోదు చేశారు. అమెరికా ఇన్వెస్టర్లు ప్రభుత్వ అధికారులను మోసం చేసి పెద్ద మొత్తంలో లంచం ఇచ్చారని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపణలు చేసింది. అదానీతో పాటు అతని మేనల్లుడు సాగర్‌తో సహా మరో 7గురిపై కేసు నమోదు చేసి, ఇప్పటికే అరెస్టు వారెంటీ కూడా జారీ చేశారు. అదానీ ఈ మోస పూరిత చర్యకు పాల్పడినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది. అయితే నిజంగానే గౌతమ్ అదానీ నేరం చేసినట్లు రుజువైతే.. ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? జరిమానా ఏమైనా విధించే అవకాశం ఉందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌లో గౌతమ్ అదానీ ఇన్వెస్టర్లకు లంచం ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు అక్కడి న్యాయవాదులు అంటున్నారు. దీనికి సంబంధించిన డిటేల్ స్పెడ్ షీట్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఫొటోగ్రాఫ్స్ వంటి ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజం అని తేలితే.. అక్కడ రూల్స్ ప్రకారం గౌతమ్ అదానీ తప్పకుండా శిక్ష పడుతుందని అంటున్నారు. ఈ నేరం అదానీ చేశాడని రుజువైతే దాదాపుగా 20 ఏళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు 2 మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఈ జరిమానా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం అంతా ప్రెసిడింగ్ జడ్జి పైనే ఆధారపడి ఉంటుందని అమెరికా వర్గాల సమాచారం. ఇదే కానీ జరిగితే అదానీ జైలుకు వెళ్లడం పక్కా.

దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే వీటిపై గౌతమ్ అదానీ కూడా స్పందించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా తెలిపారు. నిజం తప్పకుండా గెలుస్తుందని, తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. అయితే గౌతమ్ అదానీపై పలుమార్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో హిండెన్‌బర్గ్, బొగ్గు విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఇప్పుడు కూడా గౌతమ్ అదానీ షేర్లు ఒక్క రోజులోనే రూ. 2.24 లక్షల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని క్షణాల్లోనే ఇన్ని కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వం వైసీపీ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
Oktelugu Epaper