Homeఆంధ్రప్రదేశ్‌ఆ వీడియోలు డీజీపీ అందించాం..!

ఆ వీడియోలు డీజీపీ అందించాం..!


రాష్ట్రంలో కార్మికులు, కూలీలు అందరూ ఆకలితో అలమటిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం పబ్లిసిటీ పిచ్చితో తిరుగుతున్నారని, ప్రజలకి కరోనా సోకడానికి కారణమవుతున్నారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి వీడియోలను తాము డీజీపీకి ఇచ్చామన్నారు. ఏపీలో ఒక్క రోజులో 61 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని తెలిపారు. వైసీపీ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను బలిపెట్టొద్దని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం సొంతంగా ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టలేదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఇచ్చిన రూ.1000లో కూడా సగం కొట్టేశారని అన్నారు. శనగల పంపిణీలో కూడా అక్రమాలు జరిగాయని చెప్పారు.

కేరళలో సమర్థవంతంగా పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 13 రకాల నిత్యావసర సరుకులు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటింటికీ పంపారని తెలిపారు. ఏపీలో మాత్రం మాటలు తప్ప పనులు లేవని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టడంతో అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా కరోనా వచ్చిందన్నారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పారు.

మన ముఖ్యమంత్రి తాడేపల్లిలో తన ఇంట్లోనే కూర్చుంటున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, ప్రధాని మోదీ నుంచి మేధావుల వరకు అందరితో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రోజా లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. వైసీపీ నేతలకు చట్టాల మీద అవగాహన లేదని, ఇతర రాష్ట్రాల్లో ఏయే కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడాలని చెప్పారు. పుచ్చిపోయిన కందులు వంటి సరుకులను అందిస్తున్నారని చెప్పారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular