
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్యలు రోజు రోజుకూ వివాదాస్పదం అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటోకి కొందరు క్రమ పద్ధతిలో నిలబడి వంగి, వంగి దండాలు పెడుతున్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనం ఇండియాలో ఉన్నామా…ఉత్తర కొరియా, ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే విజయనగరం జిలా నెల్లిమరలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ వాలంటీర్లు అందరికీ కరోనా నేపథ్యంలో బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయంలో పనిచేస్తోన్న వాలంటీర్లు అందరితో అక్కడి వైసిపి నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోకు వంగి, వంగి దండాలు పెట్టించారు. ఈ సంఘటనను ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు తప్పుబట్టారు.
https://www.facebook.com/KidariSravanKumarOfficial/videos/516477759019840/