Chandrababu bjp
Chandrababu : టిడిపి, జనసేన, బిజెపి పొత్తు 2014 ఫలితాలు రిపీట్ చేస్తాయని అంతా భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేయగా జనసేన మద్దతు ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. పొత్తులో భాగంగా టిడిపి ఆ రెండు పార్టీలకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయనుంది. అంటే పొత్తులో భాగంగా సింహభాగం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. అంటే కూటమిలే ఎక్కువ బాధ్యత ఆ పార్టీ పైన ఉంటుంది. ఆ పార్టీ మేనిఫెస్టో అసలు సిసలైనదిగా భావించాలి.
అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించింది. భారీ సంక్షేమ పథకాలతో మేనిఫెస్టోను రూపొందించనుంది. ప్రజలకు భారీగా హామీలు ఇవ్వనుంది. అయితే వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఈ విషయంలో బిజెపిపై బాధ్యత వేయాలని చంద్రబాబు చూస్తున్నారు.చంద్రబాబు ఇచ్చిన హామీలకు బిజెపి అండగా నిలబడుతుందని భావిస్తున్నారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ తీరుకోకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ తాజాగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే దాదాపు 85 వేల కోట్ల రూపాయలు అవసరం.అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే జగన్ పథకాలను సైతం కొనసాగిస్తానని చంద్రబాబు ప్రకటించారు. జగన్ ప్రకటించిన పథకాలకు దాదాపు 70 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ లెక్కన చంద్రబాబు మొత్తం పథకాలను అమలు చేయాలంటే దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అవసరం. అయితే వాటికి కేంద్ర ప్రభుత్వం సహకారం కీలకం. ఈ లెక్కన ఈ పథకాలకు బిజెపి బాధ్యత తీసుకుంటుందా? ఇప్పటికే పొత్తులు కుదుర్చుకున్న ఆ రెండు పార్టీలు.. అధికారంలోకి వస్తే సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. రాష్ట్రంలో టిడిపి తో, కేంద్రంలో బిజెపితో ఆ మూడు పార్టీలు సంయుక్తంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చే హామీలకు బిజెపి కానీ.. జనసేన కానీ బాధ్యత వహిస్తాయా? అన్నది ఇప్పుడు ప్రశ్న. అలా బాధ్యత వహిస్తామని చెబితే గానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే 2014లో ఇదే తరహా హామీలు ఇచ్చి.. ఆ రెండు పార్టీలు విడిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి రాదని హామీ ఇస్తూ చంద్రబాబు ప్రకటించే హామీలకు బిజెపి బాధ్యత వహిస్తేనే కూటమి సక్సెస్ అయ్యేది. మరి వాళ్ళు ఎలా నడుచుకుంటారో చూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Chandrababu is bjp ok with chandrababus promises
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com