ముఖ్యమంత్రి ప్రజలకు అండగా ఉండాల్సిన సమయంలో, ముఖ్యమంత్రికి ప్రజలు అండగా ఉండాలంటూ అర్ధం లేని ప్రకటనలు ఇచ్చి ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చెయ్యడమే కరోనా పై జగన్ చేస్తున్న పోరాటమా అని టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. శ్మశానాల దగ్గర నుండి మరుగుదొడ్ల వరకూ దేనిని వదలకుండా వైకాపా రంగులు వేసుకోవడానికి రూ. 2 వేల కోట్లు మింగారని ట్వీట్ చేశారు. ఇప్పుడు అవి తొలగించే పేరుతో మరో రూ. 2 వేల కోట్లు కాజేసేందుకు చూసున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు దోచుకున్న రూ. 4 వేల కోట్లు పెడితే రాష్ట్రంలో ఆసుపత్రుల్లో వెంటిలెటర్లు కొని ఉంటే ఈ సమయంలో ప్రజలకు ఉపయోగపడేవన్నారు. కరోనా లాంటి వైరస్ ని ఎదుర్కోవడానికి అన్ని వసతులు ఉన్న ప్రత్యేక ఆసుపత్రి నిర్మించుకోవచ్చని తెలిపారు. కరోనా వచ్చి ఉపాధి లేక ప్రజలు సర్వం కోల్పోయినా బ్లూ పత్రిక దోపిడీ ఆగడం లేదన్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Budha venkanna comments on jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com