Homeఆంధ్రప్రదేశ్‌లాక్ డౌన్ తో కల్లుకు పెరిగిన గిరాకీ

లాక్ డౌన్ తో కల్లుకు పెరిగిన గిరాకీ

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు గత నెల నుంచి మూతబడ్డాయి. ఫలితంగా కల్లుకు గిరాకీ పెరిగింది. గ్రామాల్లో తాడి చెట్ల వద్దకు మద్యం ప్రియులు పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో మద్యం దొరకక పోవడంతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు మరింత వింతగా ప్రవర్తించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్ లోను మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ అందుబాటులో లేకపోవడం, ఇదే సమయంలో కల్లుకు సీజన్ ప్రారంభం అవడంతో మద్యం ప్రియులు […]


లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో మద్యం షాపులు గత నెల నుంచి మూతబడ్డాయి. ఫలితంగా కల్లుకు గిరాకీ పెరిగింది. గ్రామాల్లో తాడి చెట్ల వద్దకు మద్యం ప్రియులు పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో మద్యం దొరకక పోవడంతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు మరింత వింతగా ప్రవర్తించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్ లోను మద్యానికి డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ అందుబాటులో లేకపోవడం, ఇదే సమయంలో కల్లుకు సీజన్ ప్రారంభం అవడంతో మద్యం ప్రియులు కల్లు కోసం క్యూ కడుతున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాలకు చెందిన మద్యం ప్రియులు సమీప ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు వెళ్లి కల్లుతో జీవిస్తున్నారు. ఎక్కడ కొందరు సామాజిక దూరం పాటించక పోవడంతో తోటివారు ఇబ్బందులకు గురవుతున్నారు. కల్లు కోసం కూడా కొన్నిచోట్ల పోటీ పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం మద్యానికి ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో మద్యం అక్రమంగా తరలిస్తున్న ఆ శాఖ సి.ఐ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు, చిత్తూరు, తదితర జిల్లాలో కొన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలలో దొంగతనాలు జరిగాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలో మద్యం కు ఉన్న డిమాండను స్పష్టం చూస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper