Homeజాతీయ వార్తలుBangladesh Border Infiltration: బెంగాల్లో బిజెపి విజయం.. బంగ్లా సరిహద్దు కుట్రలకు ఇక చెక్

Bangladesh Border Infiltration: బెంగాల్లో బిజెపి విజయం.. బంగ్లా సరిహద్దు కుట్రలకు ఇక చెక్

Bangladesh Border Infiltration: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తృణమూల్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. 70 ఏళ్ల చరిత్రలో బీజేపీ తొలిసారి గెలిచింది. అయితే ఇది తృణమూల్‌కు షాక్‌ ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా బంగ్లాదేశీయులకు షాక్‌. ఎందుకంటే అక్రమ చొరబాటు, ఆయుధ స్మగ్లింగ్‌ మార్గాలు మూసుకుపోతున్నాయి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో భారతంలో బీజేపీ గెలుపును ’ప్రమాదకరం’గా చూపించింది. బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడడం కష్టమవుతోంది. ఉగ్ర సంస్థల బెదిరింపులు.. చాత్ర సైనిక్‌ జనతా వంటి […]

Bangladesh Border Infiltration: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తృణమూల్‌ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. 70 ఏళ్ల చరిత్రలో బీజేపీ తొలిసారి గెలిచింది. అయితే ఇది తృణమూల్‌కు షాక్‌ ఇచ్చింది. అంతకన్నా ఎక్కువగా బంగ్లాదేశీయులకు షాక్‌. ఎందుకంటే అక్రమ చొరబాటు, ఆయుధ స్మగ్లింగ్‌ మార్గాలు మూసుకుపోతున్నాయి. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో భారతంలో బీజేపీ గెలుపును ’ప్రమాదకరం’గా చూపించింది. బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడడం కష్టమవుతోంది.

ఉగ్ర సంస్థల బెదిరింపులు..
చాత్ర సైనిక్‌ జనతా వంటి గుండాలు సువేందు అధికారిని ’సరిహద్దులో సమాధి’ చేస్తామని, మమత బెనర్జీ స్వతంత్ర దేశ ప్రకటనకు మద్దతిస్తామని హెచ్చరించాయి. ఇవి ఖాళీ మాటలు కావు. గోవుల అక్రమ రవాణా, ఆయుధాలు ఆగిపోవడం వెనుక ఉద్రిక్తతలు. తృణమూల్‌ నేతల వద్ద ఆయుధాలు, టన్నెల్స్‌ గుర్తింపు జరుగుతున్నాయి.

త్రిపుర ఘటన..
మే 9న త్రిపుర కమలాసాగర్‌–పతారియా జీరో పాయింట్‌ వద్ద స్మగ్లర్ల చొరబాటు ప్రయత్నంపై బీఎస్‌ఎఫ్‌ కాల్పులు. రాళ్ల దాడితో ఇద్దరు మృతి. 4,096 కి.మీ. సరిహద్దులో (బెంగాల్‌కు 2,217 కి.మీ.) అస్సాం, త్రిపుర, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్‌లో బీజేపీ/మిత్రపక్షాలు చొరబాటును అడ్డుకుంటున్నాయి. ఇది బంగ్లాదేశ్‌కు మింగుడు పడడం లేదు.

ఐఎస్‌ఐ, జమాత్‌ కుట్రలు..
పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ నాయకులు బంగ్లాదేశ్‌ సందర్శనలు, జమాత్‌ సమావేశాలు జరుపుతున్నారు. దీంతో భారత్‌ సరిహద్దు యాక్టివిటీలను పెంచింది. పేలుళ్లు, దాడుల ప్రమాదం నిఘా సంస్థల హెచ్చరిక ఉంది. తృణమూల్‌ నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణంగా భావిస్తున్నారు.

బెంగాల్‌ మార్పు జాతీయ భద్రతకు మలుపు. బలమైన ఫెన్సింగ్, డ్రోన్‌ నిఘా, బీఎస్‌ఎఫ్‌ బలోపేతం తప్పనిసరులు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల సమన్వయంతో చొరబాటు నిర్మూలించాలి. రాజకీయ పక్షపాతాలు మాని, జాతీయ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి అదే భారత మార్గం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper