West Bengal elections 2026 : బెంగాల్ ఎన్నికలు కూడా ముగుస్తున్నాయి. రేపటితో రెండో విడత కూడా ముగియనుంది. మే 4న ఫలితాలు వెలువడుతాయి.. అమిత్ షా 15 రోజులు కోల్ కతాలోనే తిష్ట వేశారు. ఆయనే స్వయంగా బీజేపీ పర్యవేక్షణ చేశారు. మోడీ 20కి పైగా ర్యాలీలు చేశారు. బెంగాల్ లో ఎప్పుడూ లేని పద్ధతిలో మోడీ సభలకు విశేషమైన మద్దతు లభించింది. అమిత్ షా, యోగీ సభలకు జనాలు పోటెత్తారు.
బెంగాల్ లో గాలి మారినట్టు కనిపిస్తోంది. బీజేపీకి ఓక ఛాన్స్ ఇద్దామన్న ఆలోచన బెంగాల్ ప్రజల్లో వచ్చినట్టుగా కనిపిస్తోంది. 2011కు ముందు సీపీఐ హవా ఉండేది. ఆ పార్టీపై వ్యతిరేకతతో మమత క్యాష్ చేసుకొని గెలిచింది. భద్ర లోక్ ఇక్కడ కీలకం.. వీరు సీపీఐకి గతంలో మద్దతు ఇచ్చారు. తర్వాత భద్రలోక్ వాళ్లు సీపీఐ కోపంతోనే మమతకు ఓటేశారు. 2016కు వచ్చేసరికి యాంటీ సీపీఎం వల్ల మమతను కంటినేషన్ గా తీసుకున్నారు.
2021 వచ్చేసరికి మధ్యతరగతిలో మార్పు వచ్చింది. అయితే బీజేపీ బలం లేకపోవడం మైనస్ గా మారింది. 2026లో ఇప్పుడు మార్పు వచ్చింది.
బెంగాల్ భద్రలోక్ లో మార్పు@ బీజేపీ గెలుపు.. దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
