Homeఆంధ్రప్రదేశ్‌వ్యవసాయ బడ్జెట్‌ లో కేటాయింపులు ఇవే..

వ్యవసాయ బడ్జెట్‌ లో కేటాయింపులు ఇవే..


2020-21 ఏపీలో వ్యవసాయ బడ్జెట్‌ ఆ శాఖ మంత్రి కన్నబాబు శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గాను రూ.29,159.97 కోట్లను ప్రతిపాదించారు. గతేడాది కాలంలో వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని, దీర్ఘకాలికంగా రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ద్వారా రూ.12,500 ఇస్తామని చెప్పి 13,500 ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

* ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు

* రైతు భరోసా కేంద్రాలకు రూ.100 కోట్లు

* వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.500 కోట్లు

* వైఎస్‌ఆర్‌ వడ్డీ లేని పంట రుణాలను రూ.1,100 కోట్లు

* రైతులకు ఎక్స్‌ గ్రేషియోకు రూ.20 కోట్లు

* రాయితీ విత్తనాల కోసం రూ.200 కోట్లు

* వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83 కోట్లు

* ప్రకతి వ్యవసాయానికి రూ.225.51 కోట్లు

* ప్రకతి విపత్తు నిధి రూ.2,000 కోట్లు

– పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92.18 కోట్లు

– ఉద్యానవన అభివృద్ధికి రూ.653.02 కోట్లు

– పశుసంవర్ధకశాఖకు రూ.854.77 కోట్లు

– వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీకి రూ.88.60 కోట్లు

– ఎన్‌జి రంగా వర్సిటీకి రూ.402 కోట్లు

– వెంకటేశ్వర పశు వైద్యశాలకు రూ.122.73 కోట్లు

– మత్స్యశాఖ అభివృద్ధికి రూ.299.27 కోట్లు

– సహకార శాఖకు రూ.248.38 కోట్లు

– వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.4,450 కోట్లు

– వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీకి రూ.6,270 కోట్లు

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular