Homeహెల్త్‌వేగంగా ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా.?

వేగంగా ఆహారం తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా.?

Eating Too Fast.
మనలో చాలామంది భోజనం చేసే సమయంలో వేగంగా భోజనం చేస్తూ ఉంటారు. పని ఒత్తిడి, ఇతర కారణాల వల్ల వేగంగా భోజనం చేస్తున్నామని చెబుతూ ఉంటారు. అయితే వేగంగా భోజనం చేయడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. వేగంగా భోజనం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వేగంగా ఆహారం తింటే శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా లభించవు.

Also Read: శనగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

వేగంగా ఆహారం తీసుకునే వాళ్లు బరువు పెరుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం ద్వారా ఊబకాయం బారిన పడే అవకాశాలు ఉండవు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. వేగంగా తినేవారిలో షుగర్ లెవెల్స్ కూడా వేగంగా పెరుగుతాయి. ఆ తరువాత డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: మితంగా భోజనం చేసి బరువు తగ్గాలనుకుంటున్నారా.. చిట్కాలివే..?

వేగంగా భోజనం చేయడం వల్ల సాధారణంగా తీసుకోవాల్సిన ఆహారంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటామని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినేవారిని గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉంటాయి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తీసుకుంటే మంచిది. వేగంగా ఆహారం తీసుకునే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

చిన్నపిల్లలు వేగంగా ఆహారం తీసుకుంటే వారికి తగిన సూచనలు చేయాలని వేగంగా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను పిల్లలకు తల్లిదండ్రులు వివరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లను అలవరచుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular