మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారం ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. తగిన నీటిని తీసుకోవడం ద్వారా మాత్రమే ఆరోగ్యంగా జీవించగలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సరిపడా నీటిని తీసుకోకపోవడం వల్ల ఎన్నో వ్యాధుల బారిన పడటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలసట, నీరసం సమస్యలతో మీరు బాధ పడుతుంటే నీళ్లు ఎక్కువగా తాగడం లేదని గుర్తుంచుకోవాలి.
శరీరానికి సరిపడా ద్రవాలు అందని పక్షంలో నోరు తడారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫలితంగా నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమస్యతో బాధ పడేవాళ్లను నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంది. నీళ్లను ఎక్కువగా తాగడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది.
ఫలితంగా నోటి దుర్వానతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు అయితే కచ్చితంగా వస్తాయి. నీళ్లు తక్కువగా తాగేవాళ్లకు మూత్రం పసుపు లేదా గోధుమ రంగులోకి మారే అవకాశం ఉంటుంది. శరీరానికి సరిపడా నీళ్లు తాగని వాళ్లు డీ హైడ్రేషన్ సమస్య బారిన పడతారు. డీ హైడ్రేషన్ వల్ల ఆకలి, తలనొప్పి, కాళ్లు చేతులు లాగడం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి రక్తసరఫరా జరగడంలో నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
నీళ్లు తాగని పక్షంలో కణాలు, శరీర భాగాలకు రక్తం అందే అవకాశం ఉండదు. తల తిరగడం, తలపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనిషి జీవించడానికి గాలి ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు.