దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ఆరు నెలల పాటు మారిటోరియం వినియోగించుకున్న వారికి చక్రవడ్డీ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటి వరకు మారిటోరియం పథకం కింద రూ. 2 కోట్ల వరకు రుణాలపై వడ్డీ మినహాయింపులు అమలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు రూ. 2 కోట్ల రూపాలయలకు మించని హౌసింగ్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు, వెహికిల్ లోన్ తీసుకున్న వారికి వడ్డ మాఫీ ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులు, ఫైనాన్ష్ కంపెనీలు వడ్డీ డబ్బులను రుణ గ్రహీత అకౌంట్లలో వేస్తాయని పేర్కంది. ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 6,500 కోట్ల భారం పడుతున్నట్లు తెలుస్తోంది.