Who is doing negative publicity on Hiramandi series
Heeramandi: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన సంజయ్ లీలా బన్సాలి మొదటిసారిగా డైరెక్షన్ చేసిన ‘ హీరామండి ది డైమండ్ బజార్’ అని వెబ్ సిరీస్ 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సిరీస్ మే 1వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ మొదటి వారంలోనే నెట్ ఫిక్స్ లో అత్యంత ఎక్కువ వ్యూస్ ను దక్కించుకున్న ఇండియన్ మొదటి వెబ్ సిరీస్ గా కూడా ఇది ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది.
ఇక మొదటి వారంలోనే 4.5 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఇక హీరామండి సిరీస్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ లాంటి అతిపెద్ద షోలను సైతం నెట్ ఫ్లిక్స్ లో వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచింది. ఇలాంటి వెబ్ సిరీస్ సంజయ్ లీలా బన్సాలి మార్క్ తో తెరకెక్కి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఇలాంటి నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ మీద కొంతమంది నెగిటివ్ ప్రచారాన్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ కరాచీ నేపథ్యంలో వేశ్యలకు ప్రాధాన్యతను ఇస్తూ తెరకెక్కించబడింది అంటూ ఈ సిరీస్ మీద నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు.
అయితే 200 కోట్లు బడ్జెట్ తీసిన ఈ సిరీస్ మీద కొంతమంది నెగిటివ్ ప్రచారం చేయడం అనేది ఆ టీమ్ కి చాలా ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇలా చేయడం వల్ల వాళ్లకు వచ్చేది ఏమీ లేదు కానీ ఈ సీరీస్ కనక అనుకున్నట్టుగా ఆడకపోతే ఇలాంటి భారీ బడ్జెట్ తో సిరీస్ లు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేస్తారు.
కాబట్టి ఈ సిరీస్ ఎలాగైనా సరే చాలా మంచి విజయాన్ని సాధిస్తేనే ఇక ముందు కూడా ఇలాంటి ఒక ప్రయోగాత్మకమైన సిరీస్ లు మన ముందుకు వస్తాయి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సీరీస్ లాంగ్ రన్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Who is doing negative publicity on heeramandi series
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com