Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: షర్మిల చివరి సెంటిమెంట్ అస్త్రం

YS Sharmila: షర్మిల చివరి సెంటిమెంట్ అస్త్రం

YS Sharmila: ‘మన ఇంటికి న్యాయం కోసం వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా?’ మొన్న ఆ మధ్యన యాత్ర సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రధారి మమ్ముట్టి పలికే డైలాగ్ ఇది. ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ డైలాగ్. అయితే రాయలసీమకు ఈ డైలాగ్ దగ్గరగా ఉంటుందన్నది ఒక వాదన. ఇప్పుడు అదే వాదన వినిపిస్తున్నారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సోదరుడు జగన్ పై గట్టి ఫైట్ చేస్తున్నారు. అయితే తన శక్తి యుక్తులన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. చివరకు సెంటిమెంట్ అస్త్రాలను సైతం వదులుతున్నారు. అది కడప ప్రజలకు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

కడప ఎంపీగా గెలిచి తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేయాలని షర్మిల భావిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అంశంపై మాట్లాడుతున్నారు. కడప ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు కొంగు చాచి అడుగుతున్నాను న్యాయం చేయండి.. మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి.. మీ వైయస్సార్ బిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి అంటూ సెంటిమెంట్ అస్త్రాలను సంధిస్తున్నారు. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

రాయలసీమలో ఆడబిడ్డది ప్రత్యేక స్థానం. పుట్టింటిని వెతుక్కుంటూ వెళ్లే మహిళకు ఎనలేని ప్రాధాన్యమిస్తారు. తోబుట్టువుగా చూసుకుని శక్తి కొలదిసాయం చేస్తారు. ఇప్పుడు దానినే గుర్తు చేస్తున్నారు షర్మిల. తోడబుట్టిన అన్న తమకు అన్యాయం చేశాడని.. ప్రజలే సోదరులుగా మారి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా భిన్నంగా స్పందిస్తోంది. రాయలసీమలోఅన్నను మోసం చెల్లెలు లేదని.. అన్నను విలన్ గా చూపే చెల్లి లేదని.. అన్నను దెబ్బతీయాలని ప్రత్యర్థులతో చేతులు కలిపి చెల్లి లేదని.. చెబుతూ వైసిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఒకపక్క షర్మిల సెంటిమెంట్ అస్త్రం.. మరోవైపు వైసీపీ తిప్పికొట్టే వ్యూహం.. మరి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular