Krishna Vamsi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కొన్ని సినిమాలను కొంతమంది హీరోలతో చేయాలని కథలను రాసుకుంటారు. కానీ అనుకుని కారణాలవల్ల ఆ సినిమాల్లో హీరోలు మారిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆ డైరెక్టర్ ఏ హీరోతో అయితే సినిమా చేస్తున్నాడో ఆ హీరోకు తగ్గట్టుగా అందులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి చేసిన ‘మనం ‘ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ సినిమా దర్శకుడు అయిన విక్రమ్ కే కుమార్ ఈ సినిమా స్టోరీని నాగార్జునకు చెప్పే కంటే ముందే కృష్ణవంశీ ‘గోవిందుడు అందరివాడేలే’ అనే స్టోరీని నాగార్జునకు వినిపించాడు. ఇందులో రామ్ చరణ్ క్యారెక్టర్ లో నాగచైతన్య, శ్రీకాంత్ పోషించిన క్యారెక్టర్ లో నాగార్జున, ప్రకాష్ రాజ్ చేసిన పాత్రలో నాగేశ్వరరావుని చేయించాలని ఎంటైర్ అక్కినేని ఫ్యామిలీతో ఈ సినిమాని తెరకెక్కించాలని తను భావించాడు. ఇక కృష్ణవంశీ ‘మహాత్మా ‘ సినిమా తర్వాత ఈ స్టోరీని నాగార్జునకు వినిపించాడు. అయినప్పటికీ నాగార్జున ఈ స్టోరీలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని అడిగాడట…
ఇక దానికి తగ్గట్టుగానే కృష్ణవంశీ ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేస్తున్న క్రమంలో కృష్ణవంశీ అక్కినేని ఫ్యామిలీ తో ఒక సినిమా చేస్తున్నాడు అంటూ మీడియా లో కొన్ని కథనాలు వచ్చాయి. ఇక దాంతో విక్రమ్ కే కుమార్ అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్లని కలుపుతూ ఒక అద్భుతమైన కథను రాసుకొని నాగార్జునకి చెప్పడంతో ఆ స్టొరీ కి ఇంప్రెస్ అయిన నాగార్జున ఆ స్టోరీని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు. మనం సినిమా స్టోరీ అనేది అలా మొదలైంది. అయితే అక్కినేని ఫ్యామిలీతో ఒక సినిమా చేయాలనే థాట్ ని తెరమీదకి తీసుకొచ్చింది మాత్రం కృష్ణవంశీ అనే చెప్పాలి. అయితే మనం సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసినందుకు గాను విక్రమ్ కే కుమార్ ప్రశంసలను అందుకోవడమే కాకుండా అక్కినేని కాంపౌండ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అఖిల్, నాగచైతన్యలతో కూడా వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విక్రమ్ కే కుమార్ మీద నాగార్జున పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, సక్సెస్ ఫుల్ సినిమా చేసినందుకు విక్రమ్ కే కుమార్ కి తను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఒక సందర్భంలో నాగార్జున చెప్పడం విశేషం..
ఎందుకంటే అన్ని జనరేషన్ లను కలుపుతూ ఒక సినిమాని తీయడం అనేది చాలా కష్టం..అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తాన్ని కలుపుతూ సూపర్ సక్సెస్ సినిమా తీయడం అంటే కత్తి మీద సాము లాంటిందనే చెప్పాలి. అయినప్పటికీ విక్రమ్ కే కుమార్ ఆ సాహసాన్ని చేసి సక్సెస్ సాధించాడు…