Trisha Vijay Controversy: తమిళనాడు రాష్ట్రానికి విజయ్ సీఎం అవుతారా.. లేదా అనే విషయాలను పక్కన పెడితే.. ఇప్పటికీ అక్కడి రాజకీయాలకు త్రిషతో సంబంధం పెడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. ఎన్నికలకు ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష మీద అడ్డంగా నోరు పారేసుకున్నాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తన మాటలను వెనక్కి తీసుకున్నారు.
ఇటీవల తమిళనాడు ఎన్నికల సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో విజయ్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించింది.. ఈ నేపథ్యంలో విజయ్ ఇంటికి త్రిష వెళ్లారు. గంటన్నర సేపు అక్కడే ఉన్నారు. అంతకుముందు ఆమె తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వెళ్లారు. అక్కడ స్వామివారి సేవలో పాల్గొని.. ప్రసాదాన్ని తీసుకొచ్చి విజయ్ కి అందించారు.. ఈ పరిణామం తర్వాత త్రిషకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతకంటే ముందు త్రిష తో విజయ్ కి సంబంధం ఉందని వార్తలు వచ్చాయి.. దీనిపై విజయ్ మాట్లాడలేదు. త్రిష కూడా స్పందించలేదు. అయితే విడాకుల కేసును కోర్టులో దాఖలు చేసే ముందు విజయ్ భార్య అందులో తన భర్తకు మరో మహిళకు సంబంధం ఉందని పేర్కొంది.
ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ అనేక మీడియా సంస్థలు ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేశాయి. ఇప్పటికి చేస్తూనే ఉన్నాయి. వాస్తవానికి ఇటువంటి వ్యవహారాలపై మాట్లాడే విషయంలో సెలబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ అటువంటి సోయి నేటి కాలంలో సెలబ్రిటీలకు లేకుండా పోయింది. విజయ్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించగానే.. చాలామంది సినీ నటులు త్రిషకు శుభాకాంక్షలు చెప్పారు. ఎవరైనా సరే జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకపోతే విజయ్, త్రిష రిలేషన్ అధికారికంగా కొనసాగుతుందనే అర్థం వచ్చేలా సెలబ్రిటీలు ఆమెకు గ్రీటింగ్స్ చెప్పారు. అయితే ఈ విషయాన్ని తమిళనటి గాయత్రి శంకర్ తప్పు పట్టారు.
తమిళనాడులో విజయ్ గెలిచిన తర్వాత హీరోయిన్ త్రిషను అభినందిస్తున్న వారిపై గాయత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.” ఒకవేళ త్రిష స్థానంలో ఇంకో పురుషుడు గనుక ఉండి ఉంటే ఇలానే ఈ సమాజం అంగీకరిస్తుందా.. తన తోటి నటుడితో సంబంధం పెట్టుకొని.. కుటుంబాన్ని విడదీస్తే ఏ సమాజం మాత్రం ఒప్పుకుంటుంది.. మగాళ్లు మొత్తం తీవ్రమైన కోపంతో రగిలిపోయేవారు. గెలవడం అనే విషయాన్ని పక్కన పెట్టండి.. కనీసం ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు కూడా ఆమె భయపడేదని” గాయత్రి ఆరోపించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరో రకమైన చర్చకు దారితీస్తున్నాయి.