Vijay Antony: తమిళ హీరోలకు మన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ ఇండస్ట్రీ లో చిన్న స్థాయిలో ఉన్న హీరోలు కూడా, ఇక్కడ తమ సినిమాలను డబ్ చేసి భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ సినిమాతో ఈయన తెలుగు , తమిళ ఇండస్ట్రీస్ లో ఎలాంటి సునామీ క్రియేట్ చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమాకు మన టాలీవుడ్ ఆడియన్స్ మినిమం గ్యారంటీ వసూళ్లు అందించారు. ప్రస్తుతం ఆయన ‘నూరుసామి’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. తనతో ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఏర్పడ్డాయి.
ఈ నెల 19 న తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలు ఆసక్తికరమైన సమాదానాలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో రిపోర్టర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఈ చిత్రం లో రైతుగా నటించారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది?’ అని అడుగుతాడు, అందుకు విజయ్ ఆంటోనీ సమాధానం చెప్తూ ‘నేను నిత్యం ఆహ్లాదకరమైన జీవితాన్ని కోరుకునే మనిషి. ప్రస్తుతం నాకు పని చెన్నై లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నేను ఎక్కువగా అక్కడే ఉండాల్సి వస్తోంది. సినీ సెలబ్రిటీ ఫేమ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ , కానీ నాకు సాధనమైన జీవిన శైలి నే ఇష్టం. పల్లెటూరిలో జీవించడం సాయంత్రం 6 నుండి 7 గంటల లోపే పడుకోవడం , పక్షుల కిలకిలారావాలు , కూడి కూతలు నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి.
రాబోయే రెండు మూడు ఏళ్ళల్లో పొలాచ్చి తరహా ప్రాంతం లో ఒక స్థలం కొనుగోలు చేసి, అక్కడే స్థిరపడతాను అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ. ఆ వ్యాఖ్యలు చేయడం తో త్వరలోనే విజయ్ ఆంటోనీ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా కాకుండా తన సినిమాకు పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మరికొందరు ఆంటున్నారు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
