Upasana: మనిషి జీవనం అత్యంత ఆధునికం అవుతుంది. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎల్లలు దాటిపోతుంది. హెల్త్ సైన్సెస్ ఇప్పటికే అనేక అద్భుత శిఖరాలకు చేరాయి. అయినా మానవులను పలు కొత్త రోగాలు వేధిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తొలగించేందుకు కొన్ని కొత్త మార్గాలు అన్వేషించారు. వాటిలో స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఒకటి. హ్యూమన్ బాడీ నుండి సెల్స్ తీసి వాటిని భద్రపరచి అత్యవసర పరిస్థితులలో చికిత్సగా వాడుకోవడం ఒక పద్దతి. మరొక ఆధునిక విధానం కూడా అందుబాటులోకి వచ్చింది.
బిడ్డ పుట్టినప్పుడు మాయ, బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి భద్రపరుస్తారు. దీన్ని కార్డు బ్లడ్ ప్రిజర్వేషన్ అంటారు. ఈ పద్దతిని తన బిడ్డ కోసం ఉపాసన అనుసరించనున్నారట. స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తుంది. తన బిడ్డ కార్డు బ్లడ్ ని ప్రిజర్వ్ చేయనున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చారు. అంటే భవిష్యత్తులో మెగా వారసుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తెలెత్తినా, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపాసన ఈ పనికి పూనుకున్నారు.
కాగా 2022 డిసెంబర్ లో చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ ప్రకటన చేశారు. తన కోడలు ఉపాసన ఆ ఆంజనేయ స్వామి అశీసులతో తల్లి అయినట్లు ప్రకటించారు. ఉపాసన తల్లైతే చూడాలనేది మెగా అభిమానుల పదేళ్ల కల. అది ఎట్టకేలకు నెరవేరింది. త్వరలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఉపాసన అమెరికాలో ప్రసవిస్తారని ఓ పుకారు లేచింది. ఆ వార్తలకు ఉపాసన చెక్ పెట్టారు. తాను ఇండియాలోని అపోలో హాస్పిటల్స్ లో ప్రసవిస్తానని ఆమె చెప్పారు.
ఇటీవల ఉపాసనకు ఘనంగా సీమంతం వేడుక ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 2012లో ఉపాసన-రామ్ చరణ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఈ క్రమంలో బంధువులు, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఎదురైనా మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఉపాసన తెలిపారు.
I have chosen @StemCyte_India India to preserve my baby’s CordBlood because of their unique Hybrid Model, Superior Technology and Highest Accreditations.
For more information, visit https://t.co/gQUuMlyRsG or call 1800 120 0086#StemCyteIndia #StemCellBanking#CordBlood… pic.twitter.com/CFMQvxTXSY
— Upasana Konidela (@upasanakonidela) June 13, 2023